AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలోని 9 జిల్లాలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. క్లస్టర్లతో మారనున్న స్వరూపం!

తెలంగాణలోని 9 జిల్లాలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఫార్మా సిటీని రద్దు చేసిన ప్రభుత్వం.. ఔటర్ రింగ్ రోడ్డుకు 60 కిలోమీటర్ల దూరంగా.. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు చేరువగా.. స్టేట్, నేషనల్ హైవేల వెంబడి 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్లస్టర్లను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా.. నగరానికి నలువైపులా.. 9 జిల్లాల్లో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది.

గతంలో కేసీఆర్ సర్కారు కందుకూరు వద్ద 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని భావించగా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి

ఔటర్ రింగ్ రోడ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో 9 జిల్లాల్లో 12 క్లస్టర్లలో ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఈ ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో చోట 1000 నుంచి 3 వేల ఎకరాల భూమిని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. మెగా మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా.. ఏడాదిలోగా ఫార్మా విలేజ్‌ల పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ANN TOP 10