కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని జగ్జీవన్ రాం చౌక్ వద్ద ప్రభుత్వ కొలాం ఆశ్రమ పాఠశాల లోని 177 వ పోలింగ్ బూత్ లో ఓటువేశారు.. సతీమణి సాయిమౌనారెడ్డితో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పట్టణంలోని డైట్ కళాశాలలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి 9.45 గంటల వరకు 13.94 ఓటింగ్ శాతం నమోదైంది.









