AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో నేడు, రేపు హై అలర్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

అలాగే 29వ తేదీన ములుగు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, కొమరం భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముండగా.. వికారాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో తేలికపాటి వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ తన వెదర్ బులిటెన్‌లో పేర్కొంది.

నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 620.4 మి.మీ, రెగొండలో 475.4 మి.మీ, మొగుళ్లపల్లెలో 430.6 మి.మీ, హనుమకొండ జిల్లాలోని పార్కల్‌లో 459.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జయశంకర్ భూపాపల్లి జిల్లావ్యాప్తంగా 301.4 మి.మీ, కరీంనగర్ జిల్లాలో 184.2 మి.మీ, మహబూబాబాద్ జిల్లాలో 176.9 మి.మీ, ములుగు జిల్లాలో 168.2 మి.మీ, జనగాం జిల్లాలో 139.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ANN TOP 10