ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది.









