AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి తొలి పర్యటన అక్కడి నుంచే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమస్యలపై దృష్టి పెట్టారు. 9 డిమాండ్లు నెరవేర్చాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ధరణి సమస్య పరిష్కరించాలని, రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందజేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపు నిచ్చిన కిషన్‌ రెడ్డి… అధ్యక్షుడి హోదాలో తొలి పర్యటనను గజ్వేల్‌ నుంచే మొదలు పెట్టనున్నారు. అక్కడ జిల్లా బీజేపీ నాయకులతో సమావేశమై స్థానిక సమస్యపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే గజ్వేల్‌లో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. కిషన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ నాయకులు… అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు సిద్ధమైయ్యారు. ఇక తెలంగాణలో BRSకు ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న కిషన్‌ రెడ్డి… చేరికలపై కూడా స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే కిషన్ రెడ్డితో పలువురు నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తాండూరు లక్ష్మారెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది.

ANN TOP 10