మహారాష్ట్రలోని రాయగఢ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు. గిరిజన గ్రామం ఇర్షాల్వాడి ఉన్న ఖలాపూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామంలో గిరిజనులకు చెందిన 46 ఇళ్లు ఉన్నాయని, అందులో 5..6 ఇళ్లు మాత్రమే ఈ ప్రమాదంలో పడకుండా మిగిలిపోయాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. శిథిలాల నుండి 25 మందిని రక్షించారు, వారిలో 21 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపారు. రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాయి.









