AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విషాదం.. బిడ్డల కళ్లెదుటే సముద్రంలోకి కొట్టుకుపోయిన అమ్మ..

ప్రతి క్షణాన్ని మధుర జ్ఞ‌ాపకంగా కెమెరాల్లో బంధించాలన్న అతి.. కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇది ఎన్నో కుటుంబాల్లో దుఃఖాన్ని మిగుల్చుతోంది. తాజాగా, భర్త, పిల్లలతో కలిసి సముద్రం తీరానికి వెళ్లిన ఓ మహిళ అనూహ్యంగా అలలకు కొట్టుకుపోయిన షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. గత నెల 9న ముంబయిలోని బాంద్రా ఫోర్ట్ సమీపంలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. భర్త పక్కనే బండపై మహిళ కూర్చుని ఉండగా.. పిల్లలు వీడియో తీసున్నారు. ఈ సమయంలో అలలు ఒక్కసారిగా విరుచుకుపడి ఆమెను లాక్కెళ్లిపోయాయి.

గత నెల 10న బాంద్రా ఫోర్ట్ సమీపంలోని బండ్‌స్టాండ్ వద్ద జ్యోతి సోనార్ అనే మహిళ, ఆమె భర్త ముకేశ్ కూర్చుని వీడియో దిగేందుకు ప్రయత్నించారు. దూరంగా నిలబడిన వారి ముగ్గురు పిల్లలు.. మొబైల్ ఫోన్‌లో ఆ దృశ్యాన్ని బంధిస్తున్నారు. ఇంతలో పెద్ద కెరటం రావడంతో.. బండపై నుంచి ఆ మహిళ జారి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. అతడు కూడా నీళ్లల్లోకి జారిపోతుంటే.. చుట్టుపక్కలున్నవారు కాపాడారు. నీళ్లల్లోకి జారిపోతున్న తల్లిని చూసి ఆ పిల్లలు ఆందోళన చెందుతూ..‘ అమ్మా అమ్మా అని అరవడం’ వీడియో చూసిన వారి హృదయాలను కదిలిస్తోంది.

చివరకు జ్యోతి సోనార్‌ మృతదేహాన్ని రెండు రోజుల తర్వాత కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెలికితీశారు. ముకేశ్ మాట్లాడుతూ.. ‘ఒక వ్యక్తి తనను లాగడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాను.. అయితే జ్యోతి ప్రవాహానికి కొట్టుకుపోయింది.. కెరటాల ఉద్ధృతికి నేను, నా భార్య బ్యాలెన్స్ కోల్పోయాం.. మేమిద్దరం జారిపోయాం.. నేను నా భార్యను పట్టుకోవడానికి ప్రయత్నించాను.. ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు, కానీ ఆమె కొట్టుకుపోయింది’ కన్నీటి పర్యంతమయ్యాడు.

ANN TOP 10