AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్

ముంబయి: ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను డిప్యూటీ సిఎం అజిత్ పవార్ కలిశారు. శరద్ పవార్‌ను కలిసిన వారిలో ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్ ఉన్నారు. తిరుగుబాటు తరువాత తొలిసారి శరద్ పవార్‌తో అజిత్ పవార్ భేటీ అయ్యారు. శరత్ పవార్ ఆశీస్సుల కోసం వచ్చామని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఎన్‌సిపిని ఐక్యంగా ఉంచాలని శరద్‌ను కోరామని, తమ విజ్ఞప్తిపి శరద్ పవార్ ఏమీ స్పందించలేదన్నారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్‌సిపి గ్రూపు చేరడంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ANN TOP 10