AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. యూఎస్ ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్ సంస్థ.. కిషన్ రెడ్డికి “గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు” ఇచ్చి సత్కరించింది. భారత దేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కిషన్ రెడ్డికి అందించారు.

భారత్ సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని ఆయన పేర్కొన్నారు.

ANN TOP 10