వరంగల్: భద్రకాళి అమ్మవారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని మోడీ పర్యటన దృష్టా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.









