ఆషాఢ మాస తొలి ఏకాదశి సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్దన్ రెడ్డి, వెంకటేశ్వర కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి దంపతులు గురువారం జూబ్లీహిల్స్ డివిజన్ ఫిల్మ్నగర్ దైవ సన్నిదానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంజీఆర్ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు. పరుచూరి గోపాలకృష్ణ గారు ప్రత్యేకంగా ఆశీర్వదించారు.










