కుండబద్దలు కొట్టిన మంత్రి కేటీఆర్
తప్పు చేసిన సిట్టింగ్ లకు ఈసారి టిక్కెట్ రాకపోవచ్చునని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఓ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై కుండబద్దలు కొట్టారు. టిక్కెట్లను ముందస్తుగానే ప్రకటిస్తామన్నారు. గవర్నర్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. ఉద్యమ పార్టీ అయినప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చుకున్నామని, అందుకే గతంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు కూడా కేబినెట్లో ఉన్నారని చెప్పారు. తాము ఇతర పార్టీల నుండి నాయకులను చేర్చుకున్నామని తెలిపారు. అదే సమయంలో ఉద్యమకారులను ఆదుకున్నామన్నారు. హైదరాబాద్ లో తాము 35 ఫ్లైఓవర్లు కట్టామని చెప్పారు.









