కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు, అవినీతి, కుంభకోణాలను చూసి ప్రజలు మరో ఇరవై ఏళ్లు ఆ పార్టీకి ఓటు వేయరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు.
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పుడు చేతులెత్తేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. నిన్న మోదీ ప్రభుత్వం వాణిజ్య సిలిండర్పై సుమారు రూ.993 పెంచిందని, ప్రజా వ్యతిరేక విధానాలకు ఇదే నిదర్శనమని అన్నారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.








