AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్..!

తన పెళ్లి గురించి కొంతకాలంగా వస్తున్న వదంతులపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని స్పష్టం చేశారు. ఈ ఒక్క మాటతో… శిఖర్ పహారియాతో తన పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె ప్రస్తుతానికి తెరదించారు.

 

వరుణ్ ధావన్‌తో కలిసి జాన్వీ నటిస్తున్న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆమెను “మీ పెళ్లి ఎప్పుడు?” అని నేరుగా ప్రశ్నించారు. దీనికి జాన్వీ ఏమాత్రం తడుముకోకుండా, “ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నటనపైనే ఉంది. పెళ్లికి ఇంకా సమయం ఉంది” అని సమాధానమిచ్చారు.

 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసే కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. గతంలో తన ఫోన్‌లో స్పీడ్ డయల్ లిస్ట్‌లో తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ తర్వాత శిఖర్ పేరు ఉందని జాన్వీ చెప్పడం, ‘శిఖు’ అని రాసి ఉన్న నెక్లెస్ ధరించడం వంటి సంఘటనలు ఈ వదంతులకు కారణమయ్యాయి.

 

అయితే, తాజా ఈవెంట్‌లో శిఖర్ పేరును ప్రస్తావించనప్పటికీ, పెళ్లి వార్తలపై జాన్వీ నేరుగా స్పందించడం ఇదే మొదటిసారి. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.

ANN TOP 10