తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురవగా మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఒకట్రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ సైంటిస్ట్ సోమా సేన్ పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడియా, దక్షిణ చత్తీస్ఘఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాగల నాలుగు రోజుల్లో పశ్చిమ తీరం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. ఈరోజు, రేపు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.
ఉత్తరాదిని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తగా ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాఖండ్లో ఈరోజు, రేపు అతిభారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ సైంటిస్ట్ సోమా సేన్ తెలిపారు.