AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీశైల మల్లన్న సన్నిధిలో తెలంగాణ ప్రముఖులు

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. వీరితోపాటు మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, తుడి మేగారెడ్డి దర్శించుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న వీరికి ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో అధికారులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ఠప్రసాదాలు అందించారు.

ANN TOP 10