AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామోజీ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది.. ప్రధాని నరేంద్ర మోదీ

ప్రముఖ మీడియా ప్రముఖుడు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు(ramoji rao) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ రామోజీరావుకు నివాళులు ప్రకటించారు. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆయన సహకారం జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేసిందన్నారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారని వెల్లడించారు. ఈ క్రమంలో రామోజీరావు మృతికి సంతాపం తెలుపుతూ భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ప్రధాని మోదీ అభివర్ణించారు.

ANN TOP 10