AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘అదే జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకే’

ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లేఖలో కీలక అంశాలపై అనుమానాలు లేవనెత్తారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కామెంట్స్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదని అభిప్రాయపడ్డారు. ఆ పని చేయకపోవడం వల్లే సీబీఐ విచారణ కోరుతున్నామని అన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారని. ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు తమ అవసరాలను తీర్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్పందించి సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని బండి సంజయ్ కోరారు.

ANN TOP 10