AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్ లో చికిత్స

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దీని ప్రభావంతో జేసీ అస్వస్థతకు గురయ్యారు. భాష్పవాయువు కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఎవరూ రావద్దని కార్యకర్తలను ఆయన కోరారు. మరోవైపు, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కిమ్స్ డాక్టర్లు తెలిపారు.

ANN TOP 10