AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పీఎం మోదీతో జగన్‌ భేటీ..

తాజా రాజకీయాలపై చర్చ
విభజన హామీలు, నిధులపైనా ప్రస్తావన
సబ్సిడీ బకాయిలను త్వరగా క్లియర్‌ చేయాలంటూ వినతి

అమ్మన్యూస్‌ ప్రతినిధి, న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్రమోదీని శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో కలిశారు. సుమారు అరగంట పాటు ప్రధానితో వివిధ కీలక అంశాలపై ఆయన చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం, పెండిరగ్‌ అంశాలపై ప్రధానికి జగన్‌ వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం త్వరిత గతిన నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీని జగన్‌ కోరారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, కేంద్ర వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులతో సహా, నూతన జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు అనుమతులు, సుదీర్ఘకాలంగా పౌరసరఫరాల శాఖల నుంచి పెండిరగ్‌ లో ఉన్న సబ్సిడీ బకాయిలను త్వరగా క్లియర్‌ చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపైనా ప్రధాని మోదీ, జగన్‌ మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. వైసీపీ సహకారం పార్లమెంట్‌ లోపల బయట బీజేపీకి కొనసాగుతూనే ఉంది. మరికొద్ది కాలంలో అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ, జగన్‌ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చ జరిగిందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఢల్లీి వెళ్లి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లివచ్చిన రెండురోజుల వ్యవధిలోనే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం, ప్రధానితో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో ఏపీలో తాజా రాజకీయాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ANN TOP 10