AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గణతంత్ర వేడుకలకు గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం

సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రాజ్‌భవన్‌లో కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు గవర్నర్తో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించనున్న వేడుకలకు తమిళిసైని సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

మరోవైపు గవర్నర్ తో భేటీలో ఇరువురు నేతలు పలు విషయాలు చర్చించినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. అంతే కాకుండా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఖాళీల భర్తీ అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల విజ్ఞప్తులకు గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ANN TOP 10