మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వెళ్లిన దుబాయ్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు దుబాయ్లో ఆయా ప్రాంతాలను వీక్షిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి జీవనోపాధి పొందుతున్న కార్మికులతో మల్లారెడ్డి మాట్లాడి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. దీనికి తోడు దుబాయ్లోని ఎత్తైన భవనాలపై నిలబడి గుడ్ లక్ చెబుతున్న ఫొటోలు వైరల్గా మారాయి.









