రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజ్ భవన్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. వీణను బహూకరించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా , జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.









