‘స్వచ్ఛ’ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయస్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. నిరుడు నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా, స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో రాష్ర్టానికి నాలుగు పురస్కారాలు దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకొని ఘనతను చాటింది. సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట పట్టణాలు దక్షిణ భారతదేశ విభాగంలో అవార్డులను దక్కించుకొన్నాయి. ఈ అవార్డులను ఈ నెల 11న ఢిల్లీ ప్రగతి మైదాన్లో కేంద్రం అందించనున్నది.









