AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ప్రజాపాలన’కు ఏర్పాట్లు పూర్తి చేయండి: దానకిశోర్‌

నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలనలో భాగంగా వార్డు సభలకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన సన్నద్ధతపై సీడీఎంఏ హరిచందన, జేడీలు కృష్ణమోహన్‌రెడ్డి, శ్రీధర్‌తో పాటు ఇతర మున్సిపల్‌ శాఖ కమిషనర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రజాపాలన, వార్డు సభల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. దరఖాస్తులు స్వీకరించడం, రసీదులు ఇవ్వడం, వాటిని కంప్యూటరీకరించడం వంటి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు సభల తేదీలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అన్నారు. వార్డు సభల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. కార్యక్రమంపై రోజువారీ నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని కోరారు.

ANN TOP 10