AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్.. NCRB నివేదికలో విస్తుపోయే నిజాలు!

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యవసర సరుకులు మెుదలు చిన్న పిల్లులు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పక్కోడి ప్రాణానికి ఏమైతేనేం.. మనకు పైసలే ముఖ్యమంటూ ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. తాజాగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆహార కల్తీలో హైదరాబాద్ సిటీ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే రికార్డయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద ఈ కేసులు నమోదు చేశారు. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు కావడం గమనార్హం.

ఇక తెలంగాణ వ్యాప్తంగా చూస్తే.. 2022లో మొత్తం 1,631 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2022లో 4,694 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా.. తెలంగాణలోనే దాదాపు 35 శాతానికి పైగా కేసులు నమోదు కావటం విశేషం. 2021లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,320 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ సిటీలో ఎక్కువ కేసులు నమోదు కావటంపై అధికారుల వాదన మరోలా ఉంది. మిగతా సిటీల కంటే తామే ఎక్కువ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నామని, అందుకే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు.

కాగా, హైదరాబాద్‌లో కల్తీ ఆహారం తయారు చేస్తున్నవారిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని… స్ట్రీట్ ఫుడ్స్, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లను పట్టించుకునే నాథుడే ఉండటం లేదని కొందరు అంటున్నారు. ఏ నూనెలు వాడుతున్నారో, ఎన్నిసార్లు వేడి చేసిన నూనెను వాడుతున్నారో తెలుసుకోవడం కూడా కష్టంగా ఉందని.. ఒకవేళ చెకింగ్స్‌‌లో నాసిరకం ఫుడ్, అరిశుభ్రత, కల్తీ ప్రొడక్ట్స్‌‌ కనిపిస్తే నోటీసులు ఇవ్వడం, నామమాత్రపు ఫైన్ విధించి వదిలేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆహారం కల్తీ చేసేవారికి భయం లేకుండా పోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ANN TOP 10