AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరల్డ్ కప్ మనదే.. మరి కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ

వరల్డ్ కప్ 2023లో తుది సమరానికి వేళైంది. మరి కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా కప్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేన.. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ట్రోఫీని ముద్దాడుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం రెండు రోజుల నుంచే అహ్మదాబాద్‌లో ఫ్యాన్స్ సందడి మొదలైంది. 1.3 లక్షల మంది సమక్షంలో నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే భారత్ ఫేవరేట్‌గా కనిపిస్తుండగా.. తొలిసారి ఆస్ట్రేలియా అండర్ డాగ్‌గా ఫైనల్లో అడుగుపెడుతోంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఆస్ట్రాలజిస్టుల దగ్గర్నుంచి.. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఈసారి భారత్ ఫేవరేట్ అని చెబుతున్నారు.

అహ్మదాబాద్ స్టేడియం జడేజా, బుమ్రాకు హోం గ్రౌండ్. షమీ, గిల్ ఇక్కడే గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. దీంతో వీరికి అహ్మదాబాద్ స్టేడియం కొట్టిన పిండి. ఇవన్నీ భారత్‌కు కలిసొచ్చే అంశాలు. గత మూడు వరల్డ్ కప్‌లను ఆతిథ్య జట్టు గెలుచుకున్న సెంటిమెంట్ కూడా మనకు కలిసి రానుంది. దీంతోపాటు మరో సెంటిమెట్ ఇండియాకు అనుకూలంగా మారింది.


మెగా టోర్నీల్లో ఫైనల్‌కు ముందు కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలకు పోజులివ్వడం తెలిసిందే. 2007 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి 2019 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ.. ప్రతి ఫైనల్‌కు ముందు ట్రోఫీతో ఎడమవైపు నిలిచిన కెప్టెన్ కప్‌ను ఎగరేసుకుపోయాడు. కుడివైపు నిలబడిన కెప్టెన్‌కు నిరాశే ఎదురైంది.

ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ ముంగిట ఇద్దరు కెప్టెన్లు ట్రోఫీతో కలిసి పురాతనమైన అడలజ్ మెట్ల బావి దగ్గర ఫొటో‌కు పొజ్ ఇవ్వబోయారు. రోహిత్ కుడివైపు నిల్చోగా.. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి వచ్చి రోహిత్‌‌ను ఎడమవైపు, కమిన్స్‌ను కుడివైపు నిల్చోమని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెబుతున్నారు. అన్ని సెంటిమెంట్లు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇక భారత ఆటగాళ్లు బాగా ఆడి ట్రోఫీ గెలవడమే కావాల్సింది.

ANN TOP 10