కేసులకు భయపడే వాడిని అయితే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీనిపై కృష్ణా జిల్లా పెడనలో ఆయన వారాహి యాత్రలో స్పందించారు. ఎక్కడికి రమ్మన్నా వస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. తాను నోరు తెరిస్తే కేసులు.. నోటీసులు వచ్చేస్తున్నాయని చెప్పారు. జగన్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే యువత టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటుందని అన్నారు. తమ సమావేశాలకు యువత భారీగా ఎందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.









