AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ కమిటీ నియామకం..

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల కు కేసీఆర్ సర్కారు శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్‌ (Pay Scale) చెల్లింపు కోసం కొత్త పీఆర్సీ (PRC) ని సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్‌గా రిటైర్ట్ ఐఏఎస్‌ ఎన్‌ శివశంకర్‌, సభ్యుడిగా రిటైర్ట్ ఐఏఎస్ బీ రామయ్యను కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే.. ఆరు నెల్లలోపే ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అప్పటివరకు ప్రభుత్వం ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ను చెల్లించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ నియమించాలని నిర్ణయం తీసుకున్నందుకు గానూ.. సీఎం కేసీఆర్‌కు టీెఎన్జీవోస్ కేంద్ర అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు మామిళ్ల రాజేంద‌ర్‌, మారం జ‌గ‌దీశ్వ‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పీఆర్సీ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్‌ బీ రామయ్యల‌ను నియమించ‌డంతో పాటు మధ్యంతర భృతి ప్ర‌క‌టించినందుకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల‌ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ANN TOP 10