AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముఖ్యమంత్రి జగన్‌కు స్వల్ప అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన అపాయింట్‌మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. అంతకుముందు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు.

ANN TOP 10