హైదరాబాద్: మధురానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. గోకరాజు రంగరాజు కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్ను ద్రితేక్షణ్ అనే విద్యార్థి తన ఇంట్లో ఉరేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ద్రితేక్షణ్ వర్మ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.









