AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల ఆందోళన..

హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్ తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ కార్యకర్తలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, 13మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్లో‌ సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపి అర్వింద్ అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. అర్వింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల కార్యకర్తలు బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు.

ANN TOP 10