AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొంగులేటి రాకతో గాంధీభవన్‌లో సందడి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సత్కరించిన పీసీసీచీఫ్‌
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తొలిసారి మంగళవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. పొంగులేటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పూలబొకే ఇచ్చి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌లో చేరిన తరువాత తొలిసారి పొంగులేటి గాంధీభవన్‌కు రావడంతో కాసేపు సందడి నెలకొంది. ఆయనతో పాటు పలువురు నేతలు గాంధీభవన్‌కు వచ్చారు. అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు పొంగులేటి భేటీ అయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల కోసం పార్టీని ఎలా మందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిరచి తీరుతానంటూ పలుమార్లు పొంగులేటి సవాల్‌ చేశారు. గత ఎన్నికల్లో ఒక సీటు మినహా మిగతావన్నీ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీలు మారినా.. కాంగ్రెస్‌ క్యాడర్‌ మాత్రం అలాగే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో 10కి 10 స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. పొంగులేటి పార్టీలో చేరిన తర్వాత ఖమ్మంలో కాంగ్రెస్‌ మరింత పుంజుకున్నట్లు చెబుతున్నారు.

ANN TOP 10