

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి బస్తీలో పర్యటన
ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్ గౌరిశంకర్ కాలనీ రామాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర కాలనీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎంజీఆర్ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం మన్నె గోవర్ధ్దన్ రెడ్డి.. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్తీలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన ఉద్యమకారులను కలిసి వారికి శాలువా కప్పి సన్మానించారు.












