AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలోని మూడు జిల్లాల్లో మరో 23 రైల్వే స్టేషన్లు మూసివేత..

దక్షిణ మధ్య రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్లను మూసివేసేందుకు సిద్ధమైంది.. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్టేషన్లు మూతపడ్డాయి. ఈ రైల్వే స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని ఇతర రైల్వే స్టేషన్లకు సర్దుబాటు చేస్తున్నారు అధికారులు.

మే 1న విజయవాడ డివిజన్‌ పరిధిలోని ఎన్‌ఎస్‌జీ–6 కేటగిరీలో ఉన్న స్టేషన్ల మూసివేతకు తొలుత డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అభ్యంతరాలేవీ రాకపోవడంతో.. దెందులూరు, హంసవరం, అల్లూరు రోడ్డు, పెద అవుటపల్లి, బాదంపూడి, బయ్యవరం, చాగల్లు, ముస్తాబాద, నవాబ్‌పాలెం, పెన్నాడ అగ్రహారం, రావికంపాడు, తాడి, శ్రీ వెంకటేశ్వరపాలెం, తాలమంచి, తేలప్రోలు, వట్లూరు రైల్వే స్టేషన్లను మూసివేశారు. జూన్‌ 1 నుంచి వీరవల్లి, ఉంగుటూరు, కొలనుకొండ, బ్రాహ్మణగూడెం, తిమ్మాపురం, చింతపర్రు, బలభద్రపురం స్టేషన్లు ఉన్నాయి.

కొంతకాలంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగే స్టేషన్లు మినహా ప్యాసింజర్‌ రైళ్లు ఆగే వివిధ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల రాకపోకలు తగ్గాయి. రోజుకు కనీసం 25 మంది ప్రయాణికులు కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. రైల్వేకు ఆదాయం లేకపోగా.. ఆదాయానికి మించి విద్యుత్‌ వాడకం జరుగుతుండటంతో స్టేషన్లను మూసివేశారు. అలాగే రోజుకు ఒకటి, రెండు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్న చోట్ల బుకింగ్స్‌ నిలిపివేయాలని నిర్ణయించారు. ఆ స్టేషన్లలో ఇప్పటి వరకు రైల్వే సేవలు ఉపయోగించుకున్న ప్రయాణికులు ఇకపై పక్క స్టేషన్లకు వెళ్లాల్సిందే.

ANN TOP 10