బాలాపుర బస్తీలో మన్నె గోవర్ధన్రెడ్డి పర్యటన
గోవర్ధన్రెడ్డికి స్థానికుల ఆత్మీయ స్వాగతం
శ్రీకృష్ణమందిరంలో ప్రత్యేక పూజలు
(ఖైరతాబాద్ ప్రతినిధి)
ఖైరతాబాద్ డివిజన్ బాలాపుర బస్తీ శ్రీకృష్ణమందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధ్దన్ రెడ్డి(ఎంజీఆర్) ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎంజీఆర్కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్రెడ్డి బస్తీలో పర్యటించారు. స్థానికులను అప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారానికి భరోసా నిస్తూ ముందుకు సాగారు. అంతకు ముందు మన్నె గోవర్ధన్రెడ్డికి స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు.












