పిల్లల ఆస్పత్రి ప్రారంభోత్సవంలో కంది మౌనా శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ పట్టణంలో నూతనగా వెలిసిన కేర్ పిల్లల హాస్పిటల్ ను మంగళవారం అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాస రెడ్డి , మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష తో కలిసి సందర్శించారు. రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు.. యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.. అనంతరం అతిథులను యాజమాన్యం శాలువాలతో సత్కరించారు..ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








