జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పడగా.. గత నెల 4న ఎర్రగడ్డ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ షాహీన్ బేగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
ఈ నెల 12 (రేపటి ) నుంచి 22వ తేదీ వరకు పబ్లిక్ హాలిడే మినహా (13, 14, 17, 21) నామినేషన్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ (ఎన్నికల విభాగం) నామినేషన్లు స్వీకరిస్తారు.
నామినేషన్లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు.
ఈ నెల 23న నామినేషన్ల పరిశీలన
26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు..ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన.
వచ్చే నెల 5న ఎన్నిక-జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ.
అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి కౌంటింగ్, ఫలితాల వెల్లడి









