ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఎన్డీయే కూటమికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8 సీట్లలో గెలిచింది.









