ప్రధాని మోదీ వారణాసిలో వెనకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉండడం ఉత్కంఠ రేపుతోంది. 6223 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా లోక్సభ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది.. కానీ విపక్ష ఇండియా కూటమి సైతం బలమైన పోటీ ఇస్తోంది.









