AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 23 వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీలో అతి భారీ వ‌ర్షాలు..!

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. మే 23వ తేదీ వ‌ర‌కు కూడా తెలంగాణ‌, ఏపీలో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ మీదుగా శ్రీలంక వ‌రకు ఉప‌రిత‌ల ద్రోణి ఆవ‌రించింది. స‌ముద్ర‌మ‌ట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది. త‌మిళ‌నాడులోని ఉత్త‌ర ప్రాంతాల వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం విస్త‌రించింది. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఏపీ, తెలంగాణ‌లో మోస్త‌రు నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. రేప‌టికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాల‌పై నైరుతీ రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

ANN TOP 10