AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సహజ రంగులతో హోలీ జరుపుకోండి

ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
హోలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సహజ సిద్ధమైన రంగులతో, సంప్రదాయ పద్ధతులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. కుల, మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పు కు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నా రు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.

ANN TOP 10