AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాదులో వాయుసేన విమానానికి తప్పిన ప్రమాదం

భారత వాయుసేనకు చెందిన విమానాలు కొన్ని దశాబ్దాలుగా ప్రమాదాలకు గురికావడం తెలిసిందే. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇవాళ హైదరాబాదులో వాయుసేనకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన శిక్షణ విమానం కిందికి దిగే సమయంలో హైడ్రాలిక్ వింగ్స్ తెరుచుకోలేదు. దాంతో ఆ విమానం 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో పైలెట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా ఉండడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ANN TOP 10