నేడు పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 7 పార్లమెంట్ స్థానాలపై మధ్యాహ్నం ఈ సమీక్ష జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు
దీనికి నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.









