AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూపీఎస్సీ చైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వ చర్యలను వేగవంతం చేశారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు ఉన్నతాధికారులు కలిశారు. యూపీఎస్సీ పనితీరు పరిశీలించి తెలుసుకోన్నారు. పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు అధ్యయనం చేయనున్నారు.

ANN TOP 10