AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: టీజేఎస్‌ విద్యార్థి విభాగం, బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ను ముట్టడించారు. ప్రశ్నాపత్రం లీక్‌ను నిరసిస్తూ ముట్టడికి టీజేెఎస్‌, యువ మోర్చా కార్యకర్తలు యత్నించారు. యువ మోర్చా కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లి బోర్డును ధ్వంసం చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కమిషన్‌ ఛైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని టిజెఎస్‌ డిమాండ్‌ చేసింది. టిఎస్‌పిఎస్‌పి కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించిన నేతలను అరెస్టు చేశారు. వరసగా ఆందోళనల దృష్టా అదనపు బలగాలు మోహరించాయి. టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రతను అదనపు సీవీ విక్రమ్‌ సింగ్‌ పర్యవేక్షించారు. పేపర్‌ లీకేజీ నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో పేపర్‌ లీకేజీ కేసు నిందితులు ఉన్నారు.

ANN TOP 10