AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి: ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ సుదీర్ఘ సమీక్ష

నీటి పారుదల శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. యాసంగి పంటకు నీటి విడుదల అంశంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ అంశాలపై రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. యాసంగి పంటలు వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్‌లోని పబ్‌‌ల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, జాగిలాలతో ఎంట్రీ యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్ రావు, వెంకటేశ్వర్లు, సహా ఇతర ఇంజీనర్లు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

ANN TOP 10