AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోకి గ్రాండ్‌గా విజయశాంతి రీఎంట్రీ..

మాజీ ఎంపీ విజయశాంతి అలియాస్ రాములమ్మ కాంగ్రెస్ పార్టీలోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఇటివలే (నవంబర్ 15న).. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన రాములమ్మ.. శుక్రవారం (నవంబర్ 17) కాంగ్రెస్‌‌ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా వేసి.. కాంగ్రెస్‌లోకి గ్రాండ్‌గా ఆహ్వానం తెలిపారు. ఈ కార్యక్రమంలో.. టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాములమ్మ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయాలన్న లక్ష్యంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని వివరించారు. అయితే.. ఇన్ని రోజులు ఉన్న బీజేపీ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకుండా.. దాటేశారు విజయశాంతి.

అయితే… కొంతకాలంగా విజయశాంతి బీజేపీ నాయకత్వంతో అంటీముట్టనట్టు ఉంటున్న విషయం తెలిసిందే. అందులోనూ ప్రత్యేకంగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ కుమార్‌ను మార్చి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆమె అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. పలు సందర్భాల్లో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చినప్పుడు.. మధ్యలోనే వాకౌచ్ చేస్తూ.. తన అభిప్రాయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలోని నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా ఆమె పాల్గొనకపోవటం గమనార్హం. అయితే.. ఇటీవల హైదరాబాద్ వచ్చిన మోదీకి మాత్రం రాములమ్మ స్వాగతం పలికారు. ఆ తర్వాతే అనూహ్యంగా.. పార్టీకి రాజీనామా చేయటం, కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరపటం గమనార్హం.

ANN TOP 10