AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ భేటీ

భేటీలో కీలక అంశాలపై చర్చ
రాజ్‌భవన్‌లో ఆసక్తికర సన్నివేశం

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు ఆసక్తిరంగా మారుతున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఓవైపు కసరత్తు జరుగుతుండగా.. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాజ్‌భవన్‌లో పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే రాజ్‌భవన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు.. ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాగా.. ఇప్పుడు వీళ్లిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో.. చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎస్‌తో పాటు రాజ్‌భవన్‌ అధికారులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. కేసీఆర్‌తో పాటు కేబినెట్ మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు.. సుమారు 20 నిమిషాల పాటు గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

అయితే.. ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపై చర్చించినట్టు తెలుస్తోంది. వాటితో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై కూడా గవర్నర్‌ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం.

ANN TOP 10