AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పొంగులేటి మండలంలోని సిద్ధిక్‌ నగర్‌, పల్లిపాడు, పెద్దమునగాలలో పర్యటించారు. సిద్ధిక్‌ నగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ, డప్పువాయిద్యాలు, కోలాటంతో స్వాగతం పలికారు. సిద్ధిక్‌నగర్‌లో అంబేద్కర్‌, మాజీ సర్పంచ్‌ బాగం రఘునాథరావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, పింఛన్‌ రూ 4వేలు, నిరుద్యోగుల యువతకు రెండు లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయాబాయి, రాష్ట్రమార్క్‌ఫెడ్‌ మాజీ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మునిసిపల్‌ చైర్మన్‌ సూతగాని జైపాల్‌, ఎల్‌ఎండీ కన్వీనర్‌ సూరంపల్లి రామారావు, ఆత్మకమిటీ చైర్మన్‌ కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు, సర్పంచ్‌ జ్యోతి, సువార్త, ఎదునూరి శ్రీను, కృష్ణారావు, రాంపుడి రోశయ్య పాల్గొన్నారు.

ANN TOP 10